BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో పదో తరగతి ఫలితాలు విడుదల 79 శాతం ఉత్తీర్ణత నమోదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 03:25 PM
248 వీక్షణలు

చాట్రాయి, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో చాట్రాయి మండలంలో మంచి ఫలితాలు నమోదయ్యాయి. మండలంలోని ఏడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 293 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 236 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో మండల ఉత్తీర్ణత శాతం 79గా నమోదైనట్లు ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ తెలిపారు.

మండలంలో చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అడ్డగట్ల కవిత 580 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. అదే పాఠశాలకు చెందిన పరసా మధులత 575 మార్కులతో ద్వితీయ స్థానం, చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. జస్వంత్ 574 మార్కులతో తృతీయ స్థానం పొందారు.

ఇక మండలంలోని 7 పాఠశాలల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 45 మందికి పైగా ఉన్నారని, వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు.