BREAKING
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. క్వింటాల్ పొగాకు రూ.40 వేలకు కొనాలి – అఖిలభారత కిసాన్ మహాసభ డిమాండ్ పాడి రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న విజయ డైరీ ‘కళ్యాణమస్తు’ గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఆపరేషన్ వజ్రపుహార్ కార్యక్రమం నిర్వహణ.... సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి చాట్రాయి మండలంలో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు దుస్థితితో ట్రాక్టర్ బోల్తా! ధాన్యపు నిల్వల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్ ​సింగరేణి విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు: పీడీఎస్‌యూ నిరసన ఏలూరు జిల్లాలో ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు – మినీ మహానాడు విజయవంతం ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. క్వింటాల్ పొగాకు రూ.40 వేలకు కొనాలి – అఖిలభారత కిసాన్ మహాసభ డిమాండ్ పాడి రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న విజయ డైరీ ‘కళ్యాణమస్తు’ గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఆపరేషన్ వజ్రపుహార్ కార్యక్రమం నిర్వహణ.... సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి చాట్రాయి మండలంలో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు దుస్థితితో ట్రాక్టర్ బోల్తా! ధాన్యపు నిల్వల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్ ​సింగరేణి విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు: పీడీఎస్‌యూ నిరసన ఏలూరు జిల్లాలో ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు – మినీ మహానాడు విజయవంతం ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు దుస్థితితో ట్రాక్టర్ బోల్తా!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 08:29 PM
79 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం నుంచి జయపురం వెళ్లే మార్గంలో కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్నల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.

ట్రాక్టర్‌లో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరుగెత్తుకుంటూ వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ ఇద్దరూ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

అయితే ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోడ్డు మొత్తం భారీ గుంతలతో ప్రమాదకరంగా మారిందని, అధికారులు పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.

“ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలతో ఆటలాడటమే… ఎప్పుడు ఏ వాహనం బోల్తా పడుతుందో తెలియని పరిస్థితి” అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.