చాట్రాయి మండలంలో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు దుస్థితితో ట్రాక్టర్ బోల్తా!
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం నుంచి జయపురం వెళ్లే మార్గంలో కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్నల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.
ట్రాక్టర్లో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరుగెత్తుకుంటూ వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ ఇద్దరూ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
అయితే ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోడ్డు మొత్తం భారీ గుంతలతో ప్రమాదకరంగా మారిందని, అధికారులు పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.
“ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలతో ఆటలాడటమే… ఎప్పుడు ఏ వాహనం బోల్తా పడుతుందో తెలియని పరిస్థితి” అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.