BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు దుస్థితితో ట్రాక్టర్ బోల్తా!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 08:29 PM
237 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం నుంచి జయపురం వెళ్లే మార్గంలో కొద్దిసేపటి క్రితం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్నల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.

ట్రాక్టర్‌లో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరుగెత్తుకుంటూ వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ ఇద్దరూ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

అయితే ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోడ్డు మొత్తం భారీ గుంతలతో ప్రమాదకరంగా మారిందని, అధికారులు పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.

“ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలతో ఆటలాడటమే… ఎప్పుడు ఏ వాహనం బోల్తా పడుతుందో తెలియని పరిస్థితి” అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.