BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 18 March 2026, 12:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:20 PM
169 వీక్షణలు

చాట్రాయి మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమాల విస్తరణ

చాట్రాయి, మార్చి 18: చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాల్లో “రైతన్న మీకోసం” కార్యక్రమాలను రైతులకు మరింత చేరువగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతు పండించే ప్రతి పంట లాభదాయకంగా మారేలా, వ్యవసాయాన్ని గౌరవప్రదమైన రంగంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోందని, వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య రంగాలు కలిపి సుమారు 35 శాతం వాటాను అందిస్తున్నాయని వివరించారు. “స్వర్ణాంధ్ర 2047” లక్ష్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో సంవత్సరానికి కనీసం 15 శాతం వృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వం ఐదు ప్రధాన దిశల్లో చర్యలు చేపట్టింది. సాగునీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహం ద్వారా నీటి భద్రత కల్పించడం, దేశీయ-అంతర్జాతీయ డిమాండ్ ఉన్న కొబ్బరి, కాఫీ, కోకో, ఆయిల్ పామ్ పంటల సాగును ప్రోత్సహించడం, అగ్రిటెక్ ద్వారా డిజిటల్ సేవలు అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, రైతులకు పూర్తి స్థాయి ప్రభుత్వ మద్దతు అందించడం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కే. హబీబ్ భాష రైతులతో సమావేశమై పై అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొని కరపత్రాలను రైతుల ఇళ్ల వద్ద పంపిణీ చేశారు.

ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి బి.శివశంకర్ తెలిపారు.