BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

చాట్రాయి రెవెన్యూ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 09:53 PM
138 వీక్షణలు

చాట్రాయి రెవెన్యూ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారాలు

ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చాట్రాయి తహశీల్దార్ బి. శ్వేతతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అటెండర్ వెంకటేశ్వరరావులకు ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.

అదేవిధంగా చాట్రాయి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వీఆర్వోలు వెంకట రత్నం, తేజా శేష కుమారి, వినోద్ కుమార్, టి. నాగరాజులకు నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న ప్రశంసా పత్రాలు అందించారు.

విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించిన రెవెన్యూ సిబ్బంది సేవలను గుర్తించి ఈ ప్రశంసా పత్రాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. పురస్కారాలు అందుకున్న తహశీల్దార్ శ్వేతతో పాటు రెవెన్యూ సిబ్బందిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.