చాట్రాయి రెవెన్యూ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారాలు
చాట్రాయి రెవెన్యూ సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారాలు
ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చాట్రాయి తహశీల్దార్ బి. శ్వేతతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అటెండర్ వెంకటేశ్వరరావులకు ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.
అదేవిధంగా చాట్రాయి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వీఆర్వోలు వెంకట రత్నం, తేజా శేష కుమారి, వినోద్ కుమార్, టి. నాగరాజులకు నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న ప్రశంసా పత్రాలు అందించారు.
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించిన రెవెన్యూ సిబ్బంది సేవలను గుర్తించి ఈ ప్రశంసా పత్రాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. పురస్కారాలు అందుకున్న తహశీల్దార్ శ్వేతతో పాటు రెవెన్యూ సిబ్బందిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.