www.ntodaynews.com
చాట్రాయి సొసైటీ మానవత్వం.. బాధలో ఉన్న కుటుంబానికి అండగా రూ.10 వేలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయి సొసైటీ మానవత్వం.. బాధలో ఉన్న కుటుంబానికి అండగా రూ.10 వేలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి సహకార సంఘం అప్పుదారుడు ఆవల పుల్లారావు 09.04.2026న మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చాట్రాయి సహకార సంఘం వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకుంది.
మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయాన్ని సంఘ ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహనరావు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచిన సంఘం చర్యపై గ్రామస్థులు అభినందనలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు కాలసాని సత్యనారాయణ, దివ్వెల జయరాజు, జనసేన నాయకుడు తుమ్మల కరుణాకర్, సంఘ సీఈఓ తుపాకుల కనకరావు పాల్గొన్నారు.