BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు / చాట్రాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:12 PM
80 వీక్షణలు

చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం  రైతులు అప్రమత్తంగా ఉండాలన్న వ్యవసాయాధికారి

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని చాట్రాయి, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను మండల వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మండలంలో రబీ సీజన్‌కు గాను సుమారు 12,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా, ఈ నెల 18వ తేదీ సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో చాట్రాయి, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల మేర పంట నేలకొరిగినట్లు ఆయన తెలిపారు.

పొలాల్లో నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కాండాలకు తేమ తగలకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో వారం రోజుల్లో పంట కండేలు పూర్తిగా ఎండే దశకు చేరుకునే అవకాశం ఉన్నందున, కోతకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే క్రమంలో అధిక యూరియా వినియోగం లేదా నేలలోని శిలీంద్రాల కారణంగా ఆకు, కాండం ఎండు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నివారణ చర్యగా అజోక్సిస్ట్రోబిన్ 11% + టేబుకోనజోల్ 18.3% మిశ్రమాన్ని ఎకరానికి 300 మిల్లీలీటర్ల మేర పిచికారీ చేయాలని సూచించారు.

ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.