BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు / చాట్రాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:12 PM
103 వీక్షణలు

చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం  రైతులు అప్రమత్తంగా ఉండాలన్న వ్యవసాయాధికారి

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని చాట్రాయి, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను మండల వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మండలంలో రబీ సీజన్‌కు గాను సుమారు 12,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా, ఈ నెల 18వ తేదీ సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో చాట్రాయి, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల మేర పంట నేలకొరిగినట్లు ఆయన తెలిపారు.

పొలాల్లో నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కాండాలకు తేమ తగలకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో వారం రోజుల్లో పంట కండేలు పూర్తిగా ఎండే దశకు చేరుకునే అవకాశం ఉన్నందున, కోతకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే క్రమంలో అధిక యూరియా వినియోగం లేదా నేలలోని శిలీంద్రాల కారణంగా ఆకు, కాండం ఎండు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నివారణ చర్యగా అజోక్సిస్ట్రోబిన్ 11% + టేబుకోనజోల్ 18.3% మిశ్రమాన్ని ఎకరానికి 300 మిల్లీలీటర్ల మేర పిచికారీ చేయాలని సూచించారు.

ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.