BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 20 March 2026, 09:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు / చాట్రాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:12 PM
171 వీక్షణలు

చాట్రాయిలో అకాల వర్షాలతో మొక్కజొన్న పంటకు నష్టం  రైతులు అప్రమత్తంగా ఉండాలన్న వ్యవసాయాధికారి

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని చాట్రాయి, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను మండల వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మండలంలో రబీ సీజన్‌కు గాను సుమారు 12,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా, ఈ నెల 18వ తేదీ సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో చాట్రాయి, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల మేర పంట నేలకొరిగినట్లు ఆయన తెలిపారు.

పొలాల్లో నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కాండాలకు తేమ తగలకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో వారం రోజుల్లో పంట కండేలు పూర్తిగా ఎండే దశకు చేరుకునే అవకాశం ఉన్నందున, కోతకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే క్రమంలో అధిక యూరియా వినియోగం లేదా నేలలోని శిలీంద్రాల కారణంగా ఆకు, కాండం ఎండు తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నివారణ చర్యగా అజోక్సిస్ట్రోబిన్ 11% + టేబుకోనజోల్ 18.3% మిశ్రమాన్ని ఎకరానికి 300 మిల్లీలీటర్ల మేర పిచికారీ చేయాలని సూచించారు.

ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.