www.ntodaynews.com
చాట్రాయిలో గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చాట్రాయిలో కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొనేందుకు గౌడ సంఘ నాయకులు, సంఘ సభ్యులు, పెద్దలు ఉదయం 8 గంటలకు చాట్రాయికి చేరుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చాట్రాయి మండల గౌడ సంఘ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వరరావు, నూజివీడు నియోజకవర్గ అధ్యక్షులు కందుల కృష్ణ కోరారు.