BREAKING
ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి ద్రావిడ విశ్వవిద్యాయంలో డిప్లమా ఇన్ యోగా కోర్స్ పరీక్ష ప్రారంభం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం చిట్యాల మార్కెట్ కమిటీలో ఘనంగా స్వాగత – వీడ్కోలు కార్యక్రమం పుంగనూరు MRO కార్యాలయం వద్ద నిరసన బీబీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సంబరాలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన భువనగిరి మాజీ మార్కెట్ డైరెక్టర్ భువనగిరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. తహసీల్దార్ కార్యాలయంలో సిమెంట్ బస్తాలు చోరీ చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి
www.ntodaynews.com

చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 12:22 PM
31 వీక్షణలు

చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో మహిళల భద్రత, రక్షణ అంశాలపై చాట్రాయి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ డి. రామకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

సదస్సులో మహిళలకు చట్టపరమైన హక్కులు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరియు పోలీసు శాఖ అందిస్తున్న సేవలు, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, బాలికలు మరియు మహిళలపై జరిగే వేధింపులను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

మహిళలు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, వారి భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్‌ఐ డి. రామకృష్ణ తెలిపారు.

మహిళల భద్రత కుటుంబం, సమాజం, ప్రభుత్వ ఉమ్మడి బాధ్యత అని పేర్కొంటూ, సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువతులు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మహిళల భద్రతపై అవగాహన పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్‌ఐ డి. రామకృష్ణ తెలిపారు.