BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 12:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 12:22 PM
155 వీక్షణలు

చాట్రాయిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో మహిళల భద్రత, రక్షణ అంశాలపై చాట్రాయి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ డి. రామకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

సదస్సులో మహిళలకు చట్టపరమైన హక్కులు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరియు పోలీసు శాఖ అందిస్తున్న సేవలు, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, బాలికలు మరియు మహిళలపై జరిగే వేధింపులను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

మహిళలు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, వారి భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్‌ఐ డి. రామకృష్ణ తెలిపారు.

మహిళల భద్రత కుటుంబం, సమాజం, ప్రభుత్వ ఉమ్మడి బాధ్యత అని పేర్కొంటూ, సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువతులు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మహిళల భద్రతపై అవగాహన పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్‌ఐ డి. రామకృష్ణ తెలిపారు.