BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

చాట్రాయిలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 12:55 PM
90 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాల్లో “రైతన్న మీకోసం కార్యక్రమం” నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి విషయాలపై అధికారులు వివరించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి, ప్రభుత్వ మద్దతు పథకాల గురించి కూడా రైతులకు తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించి తలసరి ఆదాయం పెంచుకునేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రిప్ సిస్టమ్, ఫెర్టిగేషన్ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు, డ్రోన్ సాంకేతికత వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులు గురించి కూడా రైతులకు తెలియజేశారు. రైతులను కేవలం ఉత్పత్తిదారులుగా కాకుండా విలువను సృష్టించే భాగస్వాములుగా మారేలా ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం కొనసాగుతుందని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, రైతులు పుచ్చకాయల సత్యనారాయణ రెడ్డి, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.