BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం 15 కి పైగా దుకాణాలు, పంచాయతీ రికార్డు రూమ్ దగ్ధం

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
26 Jul, 2026 - 07:56 AM
291 వీక్షణలు

చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం  15 కి పైగా దుకాణాలు, పంచాయతీ రికార్డు రూమ్ దగ్ధం

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామపంచాయతీకి చెందిన షెడ్లలో/షట్టర్లలో నిర్వహిస్తున్న 15 కు పైగా బొమ్మల షాపులు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి.. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అవి పక్కనే ఉన్న మిగతా దుకాణాలకు శరవేగంగా వ్యాపించాయి. దుకాణాలకు ఆనుకుని నివాస ప్రాంతాలు కూడా ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

​పంచాయతీ భవనానికీ వ్యాపించిన మంటలు

​మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న గ్రామపంచాయతీ భవనానికి కూడా అగ్నికీలలు అంటుకున్నాయి. పంచాయతీ రికార్డు రూమ్‌లోకి మంటలు విస్తరించడంతో పలు కీలక రికార్డులు కాలిపోయినట్లు సమాచారం. ​రాత్రి సమయం కావడం, అగ్నిమాపక వాహనాలు సమయానికి చేరుకోకపోవడం వల్ల నష్టం తీవ్రత పెరిగిందని తెలుస్తోంది.


తీవ్ర శ్రమ తర్వాత కేవలం రెండు ఫైర్ ఇంజన్లు మాత్రమే సంఘటనా స్థలానికి చేరుకోవడంతో, ప్రమాద తీవ్రతకు మంటలను త్వరగా అదుపు చేయడం సాధ్యపడలేదు. దీంతో వ్యాపారులు భారీగా ఆస్తి నష్టాన్ని చవిచూశారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలు అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించారు..