శిరమా శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాళి
టీడీపీ సీనియర్ నాయకుడు శిరమా శ్రీనివాసరావుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాళి
చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ బీసీ సెల్ కోశాధికారి శిరమా శ్రీనివాసరావు స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు Prathipati Pulla Rao తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పట్టణంలోని 17వ వార్డు, పాటిమీద ప్రాంతంలో ఉన్న వారి స్వగృహానికి వెళ్లి, భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శిరమా శ్రీనివాసరావు పార్టీ అభివృద్ధికి, బీసీ వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిన నాయకుడని ప్రత్తిపాటి పుల్లారావు గుర్తు చేశారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని శిరమా శ్రీనివాసరావుకు తమ నివాళులు అర్పించారు.