BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

చింతలపూడి పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్‌లో అవకతవకల ఆరోపణలు.. విచారణకు తల్లిదండ్రుల డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 05:45 PM
52 వీక్షణలు

చింతలపూడి పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్‌లో అవకతవకల ఆరోపణలు.. విచారణకు తల్లిదండ్రుల డిమాండ్

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు

ఏలూరు జిల్లా చింతలపూడి పీఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ (సుబ్బరాజు)లో పలు ఆర్థిక, పరిపాలనా అవకతవకలు జరుగుతున్నాయంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద అందించే పౌష్టికాహారంలో లోపాలు ఉన్నాయని, చిక్కీలు సుమారు 2,000కు పైగా, కోడిగుడ్లు 500 నుంచి 600 వరకు లెక్కల్లో వ్యత్యాసం ఉన్నట్లు చెబుతున్నారు.

పీఎం శ్రీ నిధుల వినియోగంలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా తప్పుడు బిల్లులు సమర్పించి నిధులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే ఉండగా, విద్యార్థుల నుంచి రూ.250 వసూలు చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మూడో శనివారం నిర్వహించే "నో బ్యాగ్ డే" సందర్భంగా విద్యార్థులకు అందించాల్సిన స్నాక్స్ ఇవ్వకుండానే బిల్లులు చేసినట్లు, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి కేటాయించిన రూ.25 వేల వ్యయంలో కూడా తప్పుడు బిల్లులు పెట్టి నిధులు డ్రా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే యాన్యువల్ డే నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన రూ.50 వేల బడ్జెట్‌ను వినియోగించకుండా విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేశారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఈ అంశంపై మండల విద్యాశాఖ అధికారి–2 కిరణ్ బాబును సంప్రదించగా, చిక్కీలు, కోడిగుడ్ల లెక్కల్లో వ్యత్యాసం ఉన్న విషయం నిజమేనని, దీనిపై ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరామని తెలిపారు. అయితే మెగా పీటీఎం లెక్కలు ఇంకా నమోదు చేయలేదని ప్రధానోపాధ్యాయుడు వివరణ ఇచ్చినట్లు చెప్పారు.

పాఠశాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలు వెలికి తీసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

గమనిక: పై వివరాలు తల్లిదండ్రుల ఆరోపణలు మరియు మండల విద్యాశాఖ అధికారి తెలిపిన ప్రాథమిక సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. అధికారిక విచారణ అనంతరం వాస్తవాలు తేలాల్సి ఉంది.