BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రమాదకర పరిస్థితి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 12:18 PM
30 వీక్షణలు

డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

ప్రధాన గేటు వద్ద భారీ గొయ్యి.. నాలుగు రోజులైనా పట్టించుకోని అధికారులు

ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ఏర్పడిన భారీ గొయ్యి ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతోంది. నాలుగు రోజులుగా ఈ గొయ్యి అలాగే ఉన్నప్పటికీ అధికారులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చే 108 అంబులెన్సులు కూడా ఆసుపత్రి ఆవరణలోకి సులభంగా ప్రవేశించలేని పరిస్థితి నెలకొంది. దీంతో అత్యవసర వైద్య సేవలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

చింతలపూడి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రి వంటి కీలక కేంద్రంలో కనీస నిర్వహణ లోపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.

ప్రధాన గేటు వద్ద ఉన్న గొయ్యిని వెంటనే పూడ్చి, రోగుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.