చింతలపూడిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఆర్కే కన్వెన్షన్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, శ్రీ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్, దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ సంయుక్తంగా ప్రారంభించారు.
డా. గుడారు జగదీష్ (ఎంఎస్ ఆర్థో) మరియు వారి వైద్య బృందం పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో వైద్యులు, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.