చిట్యాల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై కెనరా బ్యాంక్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం చిట్యాల లో గతంలో ఉన్న హరికృష్ణ వస్త్రాలయం నిర్వాహకుడు బండారు జనార్ధన్ అని అతను నార్కెట్పల్లి రోడ్డు నుండి చిట్యాల పట్టణానికి వస్తుండగా మృతి తిందాడని తెలిపారు. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వాహనాల రాకపోకల సందర్భంగా జాతీయ రహదారిపై అధికంగా ట్రాఫిక్ పెరగడం, అదే సమయంలో రహదారిపై ఏర్పడిన గుంతలు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ పరిస్థితులే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని వారు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై గుంతలను వెంటనే పూడ్చడంతో పాటు, అధిక ట్రాఫిక్ సమయంలో ప్రత్యేక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.