BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

చిట్యాల లో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 May, 2026 - 07:19 PM
771 వీక్షణలు

చిట్యాల లో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ NTODAY NEWS చిట్యాల 

10 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం

* ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్ కు తరలింపు

అక్షరకలం : చిట్యాల

నల్గొండ ​ జిల్లాతో పాటు పలు జిల్లాలలో వరుస దొంగతనాలతో కలకలం రేపుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను చిట్యాల పోలీసులు ఎట్టకేలకు  మంగళవారం  అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్దనుండి సుమారు 10 లక్షల రూపాయల విలువైన దొంగిలించబడిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి వెల్లడించారు. డి.ఎస్.పి కేసు వివరాలను తెలియజేస్తూ తరచూ దొంగ దానాలకు పాల్పడుతున్న నిందితుల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయ గ్రామానికి చెందిన  ​నీలపు నీలయ్య (26) , సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతానికి చెందిన ​బత్తిని నరేష్ అలియాస్ లవ్లీ నరేష్ చిట్యాల పోలీసులకు పట్టుబడ్డారు నిందితులు ​గతంలో వాహన చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. వీరు చర్లపల్లి జైలుకు వెళ్లిన నీలయ్య, నరేష్‌లకు అక్కడ పరిచయం ఏర్పడింది. విడుదలైన తర్వాత వీరిద్దరూ కలిసి పటాన్ చెరువులో ఒక గదిని అద్దెకు తీసుకుని ముఠాగా ఏర్పడి దొంగతనాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్, మేడ్చల్, దుండిగల్, అమీన్‌పూర్, సంగారెడ్డి మరియు చిట్యాల ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల హ్యాండిల్ లాకులు విరగ్గొట్టి చోరీ పాల్పడుతున్నారని తెలిపారు.. వాహనాలే కాకుండా తాళం వేసిన ఇళ్లు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి ​06 మోటార్ సైకిళ్లు,
​ఆలయంలో దొంగిలించిన దుర్గాదేవి, సింహం పంచలోహ విగ్రహాలు,
​సుమారు 5 గ్రాముల బంగారు వస్తువులు , స్మార్ట్ టీవీ, ల , లెనోవా ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే
​దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కే శివరాం రెడ్డి  హెచ్చరించారు. ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో పార్క్ చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ రవికుమార్ మరియు పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.