www.ntodaynews.com
చిట్యాల వద్ద భారీగా గోవుల పట్టువేత
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
NTODAY NEWS చిట్యాల
నల్లగొండ జిల్లాలో అక్రమ పశు రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ సంఖ్యలో గోవులను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చిట్యాల సీఐ నాగరాజు పర్యవేక్షణలో చిట్యాల ఎస్సై రవికుమార్, నార్కట్పల్లి ఎస్సై విష్ణుమూర్తి తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలను నిర్వహించారు ఈ తనిఖీలలో సుమారు 60 గోవులను తరలిస్తున్న ఒక భారీ లారీని పోలీసులు సీజ్ చేశారు. గోవులను అమానవీయంగా తరలిస్తున్న నిందితులపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అక్రమ రవాణాపై మా నిఘా నిరంతరం కొనసాగుతుంది. నిబంధనలు అతిక్రమించి పశువులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. అని సి.ఐ. నాగరాజు హెచ్చరించారు