చిట్యాలలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
చిట్యాలలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
నల్గొండ జిల్లా చిట్యాల మండల ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను బుధవారం చిట్యాల కనకదుర్గమ్మ గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు దేవనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు ఏళ్ల బయ్యన్న, తెలంగాణ రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శి ఏళ్ల మాధవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ప్రచార కార్యదర్శి ముప్పా సుఖేందర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఆవుల ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శి కురాకుల సుధీర్, మండల కోశాధికారి చొప్పరి లింగస్వామి, గాలి యాదగిరి, ఏనుగు రవీందర్ రెడ్డి, నూనె యాదగిరి, మెండే నరసింహ, నల్ల నర్సిరెడ్డి, కన్నెబోయిన నరేందర్ యాదవ్, గంజి గోవర్ధన్, చిర్రబోయిన రవీందర్, గుండాల లింగస్వామి, ఎద్దు శేఖర్, జటంగి శేఖర్, పబ్బు సత్తయ్య, అవిశెట్టి మల్లేష్, శ్రీ రామోజు నరేష్, మూడు దుడ్ల శ్రీకాంత్, శ్రీధర్, చిర్రబోయిన రమేష్, చాపల సతీష్ తదితర ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.