BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

చంద్రబాబు ఆదేశాలే తనకు మార్గదర్శకం: బోండా ఉమా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 03:18 PM
44 వీక్షణలు

చంద్రబాబు ఆదేశాలే తనకు మార్గదర్శకం: బోండా ఉమా

విజయవాడ, జూలై 29: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఎప్పుడూ శిరసావహిస్తానని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇటీవల నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలను కలవాల్సి వచ్చిందని, అయితే ఆ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని తెలిపారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించి ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది పూర్తిగా సమన్వయ లోపం వల్లే జరిగిందని కమిటీకి వివరించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని కమిటీకి హామీ ఇచ్చినట్లు బోండా ఉమా వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి చంద్రబాబు సూచనల మేరకు ముందుకు సాగుతానని ఆయన పునరుద్ఘాటించారు.