BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శల దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:41 PM
65 వీక్షణలు

తిరువూరు, జూన్ 3: తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నల్లగట్ల స్వామిదాసు కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పుకోదగ్గ మేలు ఏదీ చేయలేదని ఆయన ఆరోపించారు. జగన్ కంటే మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో మేనిఫెస్టో దహన కార్యక్రమాలు చేపట్టి, కూటమి పాలనలో ప్రజలకు జరిగిన నష్టాలను వివరిస్తామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని పేర్కొన్నారు.

కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదేనని స్వామిదాసు అన్నారు. చంద్రబాబు పేరు చెప్పగానే ప్రజలకు వెన్నుపోటు రాజకీయాలే గుర్తుకు వస్తాయని, ఒకప్పుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.

కులాలు, మతాలు, టీటీడీ లడ్డూ వంటి అంశాల పేరుతో రాజకీయాలు చేశారని ఆరోపించిన ఆయన, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ నల్లగట్ల సుధారాణి, రాష్ట్ర పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర పార్టీ జాయింట్ కార్యదర్శి భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, తిరువూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు రేగళ్ల మోహన్ రెడ్డి, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కావూరి వినయ్, జెడ్పీటీసీ సభ్యుడు కోట శామ్యూల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.