BREAKING
చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కలెక్టర్ సారు మీరే మాకు న్యాయం చేయండి.. ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి
www.ntodaynews.com

చనుబండ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 02:27 PM
85 వీక్షణలు

చనుబండ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం కృషి చేసిన సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, విశిష్ట పార్లమెంటేరియన్‌గా, స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఆయన సేవలను స్మరించుకున్నారు. భారత పార్లమెంటులో నాలుగు దశాబ్దాలపాటు వివిధ కీలక పదవులు నిర్వహించిన ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చనుబండ పంచాయతీ తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షుడు చీదిరాల మారేశ్వర రావు, చాట్రాయి మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ కార్యదర్శి మోదుగు లక్ష్మి విమలకుమారి, దార్ల సురేష్, నక్క రాము, మోదుగు ముత్తయ్య, విస్సంపల్లి రాజ, గద్దల అంతోని, మోదుగు ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు.