BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

చనుబండ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Apr, 2026 - 02:27 PM
60 వీక్షణలు

చనుబండ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం కృషి చేసిన సామాజిక న్యాయ పోరాట యోధుడిగా, విశిష్ట పార్లమెంటేరియన్‌గా, స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఆయన సేవలను స్మరించుకున్నారు. భారత పార్లమెంటులో నాలుగు దశాబ్దాలపాటు వివిధ కీలక పదవులు నిర్వహించిన ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చనుబండ పంచాయతీ తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షుడు చీదిరాల మారేశ్వర రావు, చాట్రాయి మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ కార్యదర్శి మోదుగు లక్ష్మి విమలకుమారి, దార్ల సురేష్, నక్క రాము, మోదుగు ముత్తయ్య, విస్సంపల్లి రాజ, గద్దల అంతోని, మోదుగు ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు.