www.ntodaynews.com
చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో మంగళవారం (జూన్ 2, 2026) వేసవి శిక్షణా శిబిరం నిర్వహించారు.
శిబిరంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు కథల పుస్తకాలు చదివి, కథలు చెప్పే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కంప్యూటర్ ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు, నీతికథలు (మోరల్ స్టోరీస్) వీక్షించారు.
విద్యార్థులలో సృజనాత్మకత, పఠనాభిరుచి, నైతిక విలువలు పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యారమ్స్ ఆటలను కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.