BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పెనుగొలను గ్రామ దేవతకు శాకాంబరీ అలంకరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 01:02 PM
33 వీక్షణలు

పెనుగొలను గ్రామ దేవతకు శాకాంబరీ అలంకరణ 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ కు ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం శాకాంబరి అలంకరణ చేశారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో  అమ్మవారి మూలవిరాట్ కు దోస, టమాట, బీర ,బెండ, సొర, చిక్కుడు, ఆలుగడ్డ, క్యారెట్, దొండ, వంకాయ, బీట్ రూట్,, ములగ, కాకర, చేమదుంప, పచ్చిమిర్చి, నిమ్మ, కలే కాయలు దండలు గా కట్టి అలంకరణ చేశారు. అదేవిధంగా గోంగూర, కరేపాకు  వంటి  ఆకుకూరలు, యాపాకు అమ్మవారు వద్ద ఉంచారు. ముందుగా అర్చకులు దాములురి సత్యనారాయణ శర్మ వేదమంత్రాలతో అమ్మవారికి అభిషేకం చేసి నూతన వస్త్ర అలంకరణ చేసి తదుపరి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ చేశారు . శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని , అమ్మవారి తమ్ముడు పోతురాజు స్వామికీ భక్తులు కొబ్బరికాయలు కొట్టి  పసుపు, కుంకుమ, పూలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయిబాబా కమిటీ సభ్యులు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం, గారెలు ప్రసాదాలు నివేదన చేసి పంపిణీ చేశారు. అమ్మవారికి శాకాంబరి అలంకరణ కళాకారులు రాళ్లచర్ల జగన్నాథం, పాశం వెంకటేశ్వర్లు చూడ ముచ్చటగా చేశారు. కొంత కాలం నుంచి ఆషాడ మాసంలో   గ్రామదేవత ముత్యాలమ్మకు శాకాంబరి అలంకరణ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహణ కమిటీ సభ్యులు  ఊటుకూరు నారాయణరావు, కోట దాసు, బొలగాని కోటేశ్వరరావు, యనమద్ది విజయకుమార్ ,కుంచం తిరుపతి రాజు పాల్గొన్నారు.