BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 17 July 2026, 10:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్యాస్ లేకున్నా పోషకాహారం.. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 10:28 AM
67 వీక్షణలు

గ్యాస్ లేకున్నా పోషకాహారం.. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు

తిరువూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం తయారీలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. తిరువూరు ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 265 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలను పంపిణీ చేశారు.

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా చిన్నారులకు పోషకాహారం తయారీలో ఆటంకం ఉండదని సీడీపీవో పి. కృష్ణకుమారి తెలిపారు. విద్యుత్తు ఉన్నప్పుడు ఇండక్షన్ స్టవ్లపై, విద్యుత్తు లేని సమయంలో యథావిధిగా గ్యాస్‌తో వంట చేసుకునేలా ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో వంట సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండక్షన్ స్టవ్లతో పాటు వాటిపై వంట చేసేందుకు అవసరమైన ప్రత్యేక పాత్రలను కూడా ప్రభుత్వం అందజేసింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వంట పని మరింత సులభమైంది.

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడింది. ఆ ప్రభావం అంగన్వాడీ కేంద్రాలపై కూడా పడటంతో, చిన్నారులకు పోషకాహారం అందించడంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లను అందించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సమస్యలు వచ్చినా సేవలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.

తిరువూరు ప్రాజెక్టు పరిధిలో చిన్నారుల వివరాలు:

తిరువూరు మండలం: 64 కేంద్రాలు – 3,161 మంది చిన్నారులు

గంపలగూడెం మండలం: 78 కేంద్రాలు – 2,875 మంది చిన్నారులు

ఏ. కొండూరు మండలం: 51 కేంద్రాలు – 2,367 మంది చిన్నారులు

విస్సన్నపేట మండలం: 72 కేంద్రాలు – 2,455 మంది చిన్నారులు

ఇండక్షన్ స్టవ్ల పంపిణీతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా చిన్నారులకు వేడి పోషకాహారం, ఉడకబెట్టిన గుడ్లు, వేడి పాలు అందించడంలో ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంగన్వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.