చనుబండలో ఆగస్టు 4న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ
చాట్రాయి, జూలై 30: చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఈ నెల 4వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవన నిర్మాణానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ రాజబాబు తెలిపారు.
భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలతో ఈఈ రాజబాబు, ఏఈ చైతన్య సమావేశమై చర్చించారు. ప్రోటోకాల్కు అనుగుణంగా భూమిపూజను ఘనంగా నిర్వహించేలా అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఈఈ రాజబాబు సూచించారు.
ఈ సమావేశంలో చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, చీదిరాల మారేశ్వరరావు, కందుల కృష్ణ, పరసా శ్రీను, డా. దుర్గాప్రసాద్, చనుబండ ఆరోగ్య కేంద్రం సిబ్బంది, మోరంపూడి రమేష్, బొట్టు దుర్గారావు, చీదిరాల మురళి తదితరులు పాల్గొన్నారు.