చనుబండలో ఇంటింటికీ రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం
చనుబండలో ఇంటింటికీ ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన మోరంపూడి శ్రీనివాసరావు
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని 4వ బూత్ పరిధిలో బూత్ కన్వీనర్ తేనేటి వేణుతో కలిసి నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రైతులు, మహిళలు, పేదలు, వృద్ధులు తదితర వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బూత్ కన్వీనర్ తేనేటి వేణుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.