BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

చనుబండలో "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 08:48 PM
78 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో సోమవారం సాయంత్రం "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమాన్ని గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రెండో బూత్ పరిధిలో నాయకులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 6,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయడం కూటమి ప్రభుత్వ ఘనత అని అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రూ.4,000కు, దివ్యాంగుల పింఛన్లను రూ.6,000కు పెంచి ప్రతి నెల ఒకటో తేదీన అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే తల్లికి వందనం, దీపం-2, స్త్రీ శక్తి, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో వంటి పథకాలతో పాటు సిమెంట్ రోడ్ల నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వరరావు, కందుల కృష్ణ, పరసా శ్రీను, నక్కా రాము, బొట్టు దుర్గారావు, గుడిమల్ల బ్రహ్మయ్య, దార్ల సురేష్ కుమార్, చేనుబోయిన వెంకటేశ్వరరావు, మిద్దె చెన్నారావు, నక్కా చెన్నారావు, విస్సంపల్లి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.