చనుబండలో పీహెచ్సీ భవనానికి ఆగస్టు 4న భూమిపూజ
చనుబండలో పీహెచ్సీ భవనానికి ఆగస్టు 4న భూమిపూజ
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఏపీ ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవన నిర్మాణానికి ఆగస్టు 4న భూమిపూజ నిర్వహించనున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ ఎంఎస్ఐడీసీ ఈఈ రాజబాబు, ఏఈతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి కార్యక్రమ ఏర్పాట్లు, స్థల పరిస్థితులను సమీక్షించారు. భూమిపూజ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
పరిశీలన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, చనుబండ పీఎస్సీఎస్ చైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిదిరాల మారేశ్వరావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, బుర్రి శ్రీకర్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.