BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

చనుబండలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామసభ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 04:33 PM
142 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని సచివాలయం-1 పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G), ఆవాస్ ప్లస్ పథకాలపై గ్రామసభ నిర్వహించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, హౌసింగ్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గృహ పథకాల అమలుపై గ్రామస్తులకు వివరాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులలో అర్హులు, అనర్హుల జాబితాలను అధికారులు గ్రామసభలో చదివి వినిపించారు. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, తదుపరి చర్యలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, చీదిరాల మారేశ్వరరావు, కూటమి నాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దివ్య, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్‌తో పాటు గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.