చనుబండలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామసభ నిర్వహణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని సచివాలయం-1 పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G), ఆవాస్ ప్లస్ పథకాలపై గ్రామసభ నిర్వహించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, హౌసింగ్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గృహ పథకాల అమలుపై గ్రామస్తులకు వివరాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులలో అర్హులు, అనర్హుల జాబితాలను అధికారులు గ్రామసభలో చదివి వినిపించారు. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, తదుపరి చర్యలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, చీదిరాల మారేశ్వరరావు, కూటమి నాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దివ్య, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్తో పాటు గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.