BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

జీవో 396 రద్దు చేయాలంటూ విస్సన్నపేటలో దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్.. సబ్‌ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 04:33 PM
40 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేటలో దస్తావేజు లేఖర్లు, స్టాంపు విక్రేతలు సోమవారం పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో నెం.396ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే విధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది దస్తావేజు లేఖర్లు, స్టాంపు విక్రేతలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 396ను వెంటనే ఉపసంహరించుకుని తమ ఉపాధికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నిరసన అనంతరం దస్తావేజు లేఖర్లు, స్టాంపు విక్రేతలు కలిసి ఇంచార్జ్ సబ్‌ రిజిస్ట్రార్ ఆళ్ళ.నాగ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో,పోతుల శ్రీనివాస రావు, రామకృష్ణ, కేతేపల్లి విజయశేఖర్, అబ్బినేని రమేష్, గోనెల దిలీప్, నూతక్కి శ్రీనివాసరావు, మహేశ్వర రావు, జ్యోతి తదితర దస్తావేజు లేఖర్లు,  ఇన్నయ్య, సుజాత తదితర స్టాంపు విక్రేతలు, సహాయకులు పాల్గొన్నారు.