BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి: అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 03:59 PM
78 వీక్షణలు

మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బాధితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు నమోదు చేసి ఎన్ని రోజులు జైళ్లలో ఉంచుతారని ప్రశ్నించిన ఆయన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

తాను గతంలో ఫిర్యాదు చేసిన అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను దూషించే యూట్యూబర్లను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మాత్రం కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

రావణ్‌పై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొంటూ, ఇటువంటి కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్యాయానికి గురైన వారికి పార్టీతో సంబంధం లేకుండా అండగా నిలిచి, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.