BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి: అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 03:59 PM
11 వీక్షణలు

మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బాధితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు నమోదు చేసి ఎన్ని రోజులు జైళ్లలో ఉంచుతారని ప్రశ్నించిన ఆయన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

తాను గతంలో ఫిర్యాదు చేసిన అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను దూషించే యూట్యూబర్లను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మాత్రం కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

రావణ్‌పై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొంటూ, ఇటువంటి కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్యాయానికి గురైన వారికి పార్టీతో సంబంధం లేకుండా అండగా నిలిచి, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.