BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో రైతు కుటుంబానికి సహకార సంఘం ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 07:30 PM
22 వీక్షణలు

రైతుల సంక్షేమం, అభివృద్ధే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.

చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యుడు, కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన నర్సింగు రాఘవులు ఇటీవల మృతి చెందారు. ఆయన భార్య జమలమ్మకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం సంఘం తరఫున రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. గురువారం మధ్యాహ్నం మృతుని ఇంటికి వెళ్లిన సంఘం అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు ఈ మొత్తాన్ని జమలమ్మకు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులకు సకాలంలో అన్ని రకాల రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన రసాయన ఎరువులను కూడా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రైతుల శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కృష్ణారావుపాలెం తాజా మాజీ సర్పంచ్ చిమటబోయిన పుల్లారావు, సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.