BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 07:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గోసవీడు, కొణిజర్లలో రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 07:31 PM
22 వీక్షణలు

గంపలగూడెం: రీసర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గోసవీడు, కొణిజర్ల గ్రామాల్లో రైతులకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో భాగంగా భూ వివరాలను సరిచేసి, ఎలాంటి తప్పులు లేకుండా రైతులకు నూతన పాస్‌పుస్తకాలను అందజేస్తున్నారు.

తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో గోసవీడు, కొణిజర్ల గ్రామాలకు చెందిన రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు.

రీసర్వే ద్వారా రైతుల భూ హక్కులకు మరింత భద్రత కలుగుతుందని అధికారులు తెలిపారు. భూ రికార్డుల్లో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దడం ద్వారా భవిష్యత్తులో భూ సంబంధిత వివాదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గంపలగూడెం తహసీల్దార్, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.