BREAKING
ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
www.ntodaynews.com

చుక్క రక్తంతో క్యాన్సర్ గుట్టురట్టు!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 09:00 PM
16 వీక్షణలు

చుక్క రక్తంతో క్యాన్సర్ గుట్టురట్టు!

హైదరాబాద్‌లోని నిమ్స్ క్యాన్సర్ చికిత్సల్లో అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొస్తోంది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (NGS) ఆధారంగా క్యాన్సర్ జీనోమిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన నిమ్స్, క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్సలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

ఈ సాంకేతికత ద్వారా కేవలం ఒక చుక్క రక్త నమూనాతోనే క్యాన్సర్‌కు సంబంధించిన జన్యుపరమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, వ్యాధి తీవ్రతను అంచనా వేయడం, రోగికి అనువైన లక్ష్యిత చికిత్స (టార్గెటెడ్ థెరపీ) ఎంపిక చేయడం మరింత సులభమవుతుంది.

ఎన్‌జీఎస్ ఆధారిత పరీక్షల ద్వారా వివిధ రకాల క్యాన్సర్లకు కారణమయ్యే జన్యు మార్పులను ఖచ్చితంగా గుర్తించవచ్చు. దీనివల్ల వ్యక్తిగతీకరించిన చికిత్స (పర్సనలైజ్డ్ మెడిసిన్) అందించే అవకాశాలు పెరుగుతాయి. భవిష్యత్తులో లిక్విడ్ బయాప్సీ వంటి ఆధునిక పరీక్షలను కూడా నిమ్స్ రోగులకు అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రపంచ స్థాయి క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స సేవలు అందుబాటులోకి రావడం రోగులకు పెద్ద ఊరటనివ్వనుంది.