BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

చుక్క రక్తంతో క్యాన్సర్ గుట్టురట్టు!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 09:00 PM
81 వీక్షణలు

చుక్క రక్తంతో క్యాన్సర్ గుట్టురట్టు!

హైదరాబాద్‌లోని నిమ్స్ క్యాన్సర్ చికిత్సల్లో అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొస్తోంది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (NGS) ఆధారంగా క్యాన్సర్ జీనోమిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన నిమ్స్, క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్సలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

ఈ సాంకేతికత ద్వారా కేవలం ఒక చుక్క రక్త నమూనాతోనే క్యాన్సర్‌కు సంబంధించిన జన్యుపరమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, వ్యాధి తీవ్రతను అంచనా వేయడం, రోగికి అనువైన లక్ష్యిత చికిత్స (టార్గెటెడ్ థెరపీ) ఎంపిక చేయడం మరింత సులభమవుతుంది.

ఎన్‌జీఎస్ ఆధారిత పరీక్షల ద్వారా వివిధ రకాల క్యాన్సర్లకు కారణమయ్యే జన్యు మార్పులను ఖచ్చితంగా గుర్తించవచ్చు. దీనివల్ల వ్యక్తిగతీకరించిన చికిత్స (పర్సనలైజ్డ్ మెడిసిన్) అందించే అవకాశాలు పెరుగుతాయి. భవిష్యత్తులో లిక్విడ్ బయాప్సీ వంటి ఆధునిక పరీక్షలను కూడా నిమ్స్ రోగులకు అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రపంచ స్థాయి క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స సేవలు అందుబాటులోకి రావడం రోగులకు పెద్ద ఊరటనివ్వనుంది.