BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 15 September 2026, 04:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి: ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో అవకతవకలపై ఉన్నతాధికారుల విచారణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Sep, 2026 - 04:17 PM
30 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు విషయంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. విశాఖపట్నంలోని విద్యుత్‌ శాఖ సీఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం చింతలపూడి ఏడీ కార్యాలయంలో రైతులను పిలిపించి వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు మంజూరు కాలేదని పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ తమకు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కాలేదని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల బృందం రైతుల నుంచి వివరాలు సేకరించి, గతంలో చేసిన దరఖాస్తులు, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు ప్రక్రియకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా విచారణతోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా, తమకు న్యాయం జరుగుతుందా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.