BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 07 March 2026, 04:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాష్ట్రస్థాయి విజేతలను అభినందించిన కలెక్టర్

తెలంగాణ
07 Mar, 2026 - 04:56 AM
295 వీక్షణలు
ముఖ్యమంత్రి కప్ 2025: రాష్ట్రస్థాయి విజేతలను అభినందించిన కలెక్టర్ బి. సత్యప్రసాద్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో ఎడిషన్ ముఖ్యమంత్రి కప్ 2025 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన జగిత్యాల జిల్లా క్రీడాకారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అభినందించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పతకాలు సాధించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ గ్రామాలు, మండలాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని రాష్ట్రస్థాయిలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. ముఖ్యంగా కబడ్డీ, ఖో-ఖో, యోగా, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడల్లో జిల్లా క్రీడాకారిణులు విశేష ప్రతిభ కనబరిచారని కొనియాడారు. విజేతల వివరాలు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పలు విభాగాల్లో పతకాలు సాధించారు. బాక్సింగ్: రజత పతకం కిక్ బాక్సింగ్: రజత పతకాలు బాస్కెట్‌బాల్ (బాలురు): కాంస్య పతకం ఖో-ఖో (బాలురు): కాంస్య పతకం యోగా, జావెలిన్ త్రో: విశేష ప్రతిభతో పతకాలు ఈ నెల 20 నుంచి జరగనున్న తదుపరి రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మహిళా క్రీడాకారిణులు మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రవికుమార్, వివిధ పాఠశాలల పీఈటీలు, క్రీడాకారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. #Jagtial #CMCup2025 #Sports #TelanganaSports #CollectorSatyaPrasad #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube