BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 13 February 2026, 08:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

స్నాన ఘట్టాల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన

తెలంగాణ
13 Feb, 2026 - 08:03 AM
156 వీక్షణలు
పాతాళగంగ స్నాన ఘట్టాల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన NTODAY NEWS: శ్రీశైలం / నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున   ఫిబ్రవరి 12: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భారీగా తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు. స్నాన ఘట్టాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతోందా, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నాయా, రన్నింగ్ వాటర్ అందుబాటులో ఉందా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. దుస్తులు మార్చుకునే గదులు శుభ్రంగా ఉన్నాయా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించారా అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నియమించిన లైఫ్ గార్డులు విధుల్లో నిరంతరం అందుబాటులో ఉన్నారా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం అవసరమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రమైన వాతావరణంలో సురక్షితంగా స్నానాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం విధుల్లో ఉండి పరిశుభ్రతను కాపాడాలని, తాగునీటి సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, మౌలిక సదుపాయాలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. #Srisailam #Mahashivaratri #NandyalDistrict #PatalaGanga #TempleArrangements #DevoteeSafety #PublicAdministration #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube