BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

వంతెన క్రింద నీటితో ప్రయాణికులు ఇబ్బందులు

తెలంగాణ
02 Dec, 2025 - 05:37 AM
171 వీక్షణలు

రైల్వే ట్రాక్ వంతెన క్రింద నీటితో ప్రయాణికులు ఇబ్బందులు

నీటిని తొలగించాలంటూ టిడిపి ఆధ్వర్యంలో నిరసన

NTODAY NEWS: రామన్నపేట రామన్నపేట, సిరిపురం మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ దగ్గర వర్షాలు వెలిసి 20 రోజులు అవుతున్న నీరు నిల్వ ఉండి ప్రయాణకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ విషయంలో రైల్వే అధికారులు వెంటనే చొరవ తీసుకొని పరిష్కార మార్గం చూపాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహ అన్నారు. సముద్రాలపై రైల్వే ట్రాక్ లను నిర్మాణం చేసి రైల్వే వ్యవస్థను పటిష్టంగా తయారు చేసినటువంటి అధికారులు ఇక్కడ ఉన్న చిన్న సమస్యను పరిష్కారం చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడకపోవడం విచారకరమైన విషయం అని అన్నారు. ఇక్కడ ప్రతినిత్యం వెహికల్స్ లోకి సైలెన్సర్ లోకి నీరు పోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంలో రైల్వే అధికారులు ప్రత్యేకమైన చొరవ చూపాలని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇట్టి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ పరిష్కారం చూపకపోవడం విచారకరమని, వెంటనే పరిష్కార మార్గం చూపి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు గోషిక చక్రపాణి, గంజి సత్యనారాయణ, కంకల మల్లేశం, నిమ్మల మధు, బడుగు రమేష్, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube