www.ntodaynews.com
దేవాలయాలకు భూమి పూజ నిర్వహణ
తెలంగాణ
ఉరుమడ్లలో దేవాలయాలకు భూమి పూజ నిర్వహణ
ముత్యాలమ్మ, మారమ్మ గుడుల శంకుస్థాపన
NTODAY NEWS: చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ముత్యాలమ్మ మరియు మారమ్మ దేవాలయాల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సీనియర్ నాయకుడు గుత్తా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.
గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ బిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్ మరియు పండితులు అతిథులను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం భూమి పూజ, గణపతి పూజ, హోమం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని, త్వరలోనే గుడి నిర్మాణాలను పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు, వివిధ కులాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
#Chityal #Nalgonda #TempleConstruction #BhumiPuja #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube