BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

ఏలూరు మున్సిపల్ ఆఫీస్ లో రాజ్యాంగ దినోత్సవం

తెలంగాణ
26 Nov, 2025 - 04:01 AM
208 వీక్షణలు
ఏలూరు మున్సిపల్ ఆఫీస్ లో రాజ్యాంగ దినోత్సవం NTODAY NEWS: ఏలూరు జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్. భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైన రోజు నవంబర్ 26వ తేదీ అని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ బి.శివారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీ ఎంతో ప్రాముఖ్యమైన రోజు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్న రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు . అందుకనే ఆ పవిత్రమైన రోజును భారత రాజ్యాంగ దినోత్సవం గా జరుపు కోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు అన్నారు. 1950 జనవరి 26 వ తేదీ రిపబ్లిక్ డే గా ప్రకటించి ఆ రోజు నుండి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు . ఆరోజు నుండి భారత దేశ పౌరులందరూ న్యాయం, స్వేచ్ఛ,సమానత్వం,రిజర్వేషన్లు పొందుతున్నారని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. రాజ్యాంగ పితామహుడు,సామాజిక సంస్కర్త, రాజకీయవేత్త, న్యాయవాది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 60 దేశాల రాజ్యాంగాన్ని చదివి భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు ఈ రాజ్యాంగం రూపొందించిన విధివిధానాల ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటాయని. ఈ రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల కమిషన్,న్యాయవ్యవస్థ,అధికారులు రాజ్యాంగంలో రూపొందించిన విధి విధానాల ద్వారా బాధ్యతలు నిర్వర్తిస్తార రనీ ఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు. భారతదేశ ప్రజలు జీవన విధానాలను గుర్తించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రచించారని ఆయన ఆశలు,ఆశయాలను ప్రతి ఒక్క పౌరుడు ముందుకు తీసుకువెళ్తూ భారతదేశ అభివృద్ధికి కంకణ బద్ధులు కావాలని ఎస్ ఎం ఆర్ పెదబాబు పిలుపునిచ్చారు.తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.కార్యక్రమాన్ని రెవిన్యూ ఆఫీసర్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎం ఇ సురేంద్రబాబు, కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు,పాము శామ్యూల్,దేవరకొండ శ్రీనివాసరావు, డిఈలు అప్పలరాజు, నారాయణరావు, రజాక్, ఏఈలు, పి ఓ, మెప్మా సీఎం,కార్పొరేషన్ లోని అన్ని సెక్షన్ల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube