BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూపై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
27 Jul, 2026 - 04:23 PM
11 వీక్షణలు

డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూపై అవగాహన కార్యక్రమం


ఎన్‌కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని నూలుకుంట గ్రామంలోని నూలుకుంట హైస్కూల్‌లో మలేరియా, డెంగ్యూ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.


ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలకు మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాపించే విధానం, వాటి లక్షణాలు, నివారణ చర్యలు, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమతెరలు ఉపయోగించడం, జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.


అలాగే, ప్రతి శుక్రవారం "ఫ్రైడే డ్రై డే (Friday Dry Day)" పాటిస్తూ ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వ పాత్రలను ఖాళీ చేసి శుభ్రపరచడం ద్వారా దోమల పెరుగుదలను నివారించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.


ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది వి. ముత్తుకుమార్, గౌతమి, గీత, ఆశా కార్యకర్తలు లక్ష్మి, పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.