BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 08:33 PM
90 వీక్షణలు

దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం

ధర్మవరం మండలం చిన్నూరు గ్రామంలో ఘటన

3200 దానిమ్మ చెట్లు అగ్నికి ఆహుతి పూత,కాయ దశలో పంట నష్టం మంటల్లో రైతు టూ-వీలర్ కూడా దగ్ధం ఆరున్నర ఎకరాల్లో తోట పూర్తిగా నష్టం

ప్రభుత్వం సహాయం చేయాలని రైతు విజ్ఞప్తి

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రైతు చుక్కలూరు రాము అనే రైతు చిన్నూరు కొండ కింద తన పొలంలో దాదాపు 8 ఎకరాల పైగా దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. పూత కాయ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో  తోటకి నిప్పు పెట్టడంతో దాదాపు 3200 దానిమ్మ చెట్లుతో పాటు డిప్ వైరు అగ్నికి ఆహుతి అయ్యాయని  రైతు కన్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు రాము మీడియాతో  మాట్లాడుతూ, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాను.ఐతే రెండు పంటలు పూర్తిగా నష్టపోయానని ఈసారైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని దానితో అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న  సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్క తోట వారు నాకు సమాచారం తెలియజేయగా నేను ఇంటి దగ్గర నుండి టూవీలర్లో పొలం దగ్గరికి వచ్చేపాటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి నేను ఏం చేయాలో దిక్కుతోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాను.

వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చేపాటికి కొంచమైనా మంటలని అదుపు చేయాలని నా 2 వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో టూవీలర్ కూడా అగ్నికి హాహుతి అయిపోయిందని.మొత్తం 8 ఎకరాల పొలంలో ఆరున్నర ఎకరాలలో ఉన్నటువంటి దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం జరిగిందని కావున నాపై దయవుంచి మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి,లు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాo అని తెలిపారు.