BREAKING
పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ ఆస్పత్రిలో నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లికి రెండేళ్ల జైలు శిక్ష పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ ఆస్పత్రిలో నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లికి రెండేళ్ల జైలు శిక్ష
www.ntodaynews.com

దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Apr, 2026 - 08:33 PM
22 వీక్షణలు

దానిమ్మ తోటకు నిప్పు.. రైతుకు రూ.15 లక్షల నష్టం

ధర్మవరం మండలం చిన్నూరు గ్రామంలో ఘటన

3200 దానిమ్మ చెట్లు అగ్నికి ఆహుతి పూత,కాయ దశలో పంట నష్టం మంటల్లో రైతు టూ-వీలర్ కూడా దగ్ధం ఆరున్నర ఎకరాల్లో తోట పూర్తిగా నష్టం

ప్రభుత్వం సహాయం చేయాలని రైతు విజ్ఞప్తి

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన రైతు చుక్కలూరు రాము అనే రైతు చిన్నూరు కొండ కింద తన పొలంలో దాదాపు 8 ఎకరాల పైగా దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాడు. పూత కాయ ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో  తోటకి నిప్పు పెట్టడంతో దాదాపు 3200 దానిమ్మ చెట్లుతో పాటు డిప్ వైరు అగ్నికి ఆహుతి అయ్యాయని  రైతు కన్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు రాము మీడియాతో  మాట్లాడుతూ, దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి దానిమ్మ చెట్లు సాగు చేస్తున్నాను.ఐతే రెండు పంటలు పూర్తిగా నష్టపోయానని ఈసారైనా పంట పూర్తిగా చేతికి వస్తుందని దానితో అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న  సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పక్క తోట వారు నాకు సమాచారం తెలియజేయగా నేను ఇంటి దగ్గర నుండి టూవీలర్లో పొలం దగ్గరికి వచ్చేపాటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి నేను ఏం చేయాలో దిక్కుతోచక స్థితిలో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశాను.

వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చేపాటికి కొంచమైనా మంటలని అదుపు చేయాలని నా 2 వీలర్ ని పక్కన పెట్టి మంటలు ఆర్పుతున్న సమయంలో టూవీలర్ కూడా అగ్నికి హాహుతి అయిపోయిందని.మొత్తం 8 ఎకరాల పొలంలో ఆరున్నర ఎకరాలలో ఉన్నటువంటి దానిమ్మ చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 15 లక్షల వరకు నష్టం జరిగిందని కావున నాపై దయవుంచి మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి,లు స్పందించి నాకు ప్రభుత్వం ద్వారా సహాయం చేసి రైతును ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాo అని తెలిపారు.