BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 15 July 2026, 01:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దాత పసుమర్తి కృష్ణమూర్తి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 01:29 PM
284 వీక్షణలు

దాత పసుమర్తి కృష్ణమూర్తి కన్నుమూత

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం: గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన ప్రముఖ దాత పసుమర్తి కృష్ణమూర్తి (97) బుధవారం వయోభారంతో తన పెద్ద కుమారుడు లక్ష్మణరావు నివాసంలో కన్నుమూశారు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు జీవితాన్ని అంకితం చేసిన కృష్ణమూర్తి, పెనుగొలను మెట్టగుట్ట ఆలయ ప్రాంగణంలో గజేంద్రమోక్షం, శివపార్వతులు, రథం, రాధాకృష్ణుల విగ్రహాలను స్వంత నిధులతో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

అలాగే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని ఆత్కూరు పరిధిలో ఉన్న పిల్లిగుట్ట వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం, శివపార్వతులు, లక్ష్మీదేవి తదితర విగ్రహాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయా దేవాలయాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.

కృష్ణమూర్తికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సేవా భావంతో గుర్తింపు పొందారు.

ఆయన మృతవార్త తెలుసుకున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, గ్రామస్తులు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన దాతృత్వాన్ని, ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.