BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పుంగనూరులో మండల సర్వసభ్య సమావేశం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:36 AM
6 వీక్షణలు

పుంగనూరులో మండల సర్వసభ్య సమావేశం!

అన్నమయ్య జిల్లా,పుంగనూరు 

వేరుశనగ విత్తనాల పంపిణీపై రైతుల ఆందోళన --7 రోజుల్లో న్యాయం చేస్తామని ఏవో రాధా హామీ.

పుంగనూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. మండల ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో అప్పాజీ అధ్యక్షతన ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని తమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి రాధా, మండల విద్యాశాఖ అధికారి నటరాజ రెడ్డి తదితరులు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రైతులు వేరుశనగ విత్తనాల పంపిణీ పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నగదు వసూలు చేసినప్పటికీ ఇప్పటివరకు విత్తనాలు అందజేయలేదని, దీంతో వేరుశనగ సాగు సీజన్ ముగిసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ అధికారిని వివరణ కోరారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి రాధా మాట్లాడుతూ, మండలానికి ఇంకా సుమారు 1,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రావాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు

అవసరమైన విత్తనాలను అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న ఏడు రోజుల్లో రైతులకు న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.