BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

పుంగనూరులో మండల సర్వసభ్య సమావేశం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jul, 2026 - 10:36 AM
55 వీక్షణలు

పుంగనూరులో మండల సర్వసభ్య సమావేశం!

అన్నమయ్య జిల్లా,పుంగనూరు 

వేరుశనగ విత్తనాల పంపిణీపై రైతుల ఆందోళన --7 రోజుల్లో న్యాయం చేస్తామని ఏవో రాధా హామీ.

పుంగనూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. మండల ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో అప్పాజీ అధ్యక్షతన ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని తమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి రాధా, మండల విద్యాశాఖ అధికారి నటరాజ రెడ్డి తదితరులు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రైతులు వేరుశనగ విత్తనాల పంపిణీ పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నగదు వసూలు చేసినప్పటికీ ఇప్పటివరకు విత్తనాలు అందజేయలేదని, దీంతో వేరుశనగ సాగు సీజన్ ముగిసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ అధికారిని వివరణ కోరారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి రాధా మాట్లాడుతూ, మండలానికి ఇంకా సుమారు 1,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రావాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు

అవసరమైన విత్తనాలను అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రానున్న ఏడు రోజుల్లో రైతులకు న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.