రోడ్లకు ఇరువైపులా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలను, తోపుడు బండ్లను వెంటనే తొలగించాలి
రోడ్లకు ఇరువైపులా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలను, తోపుడు బండ్లను వెంటనే తొలగించాలి
అన్నమయ్య జిల్లా - మదనపల్లి
జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. మంగళవారం మదనపల్లె లో "బీసెంట్ సర్కిల్ నుండి సంఘం ఫంక్షన్ హాల్" వరకు కాలి నడకన పర్యటిస్తూ ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
రోడ్లకు ఇరువైపులా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలను, తోపుడు బండ్లను వెంటనే తొలగించుకోవాలని వ్యాపారులకు సూచించారు.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలన్నారు.
వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా కేవలం నిర్దేశించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎస్పీ వెంట ట్రాఫిక్ సీఐ గురునాథ్, 1వ పట్టణ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ గాయత్రి, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, మున్సిపల్ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.