www.ntodaynews.com
నూజివీడు నియోజకవర్గ స్థాయి గౌడ సంఘం ఆత్మీయ సభ నేడు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
నూజివీడు నియోజకవర్గ స్థాయి గౌడ సంఘం ఆత్మీయ సభ నేడు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 5 గంటలకు నూజివీడు నియోజకవర్గ స్థాయి గౌడ సంఘం ఆత్మీయ సభ నిర్వహించనున్నారు.
ఈ సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా గౌడ సంఘ సభ్యులు, ప్రముఖులు హాజరుకానున్నారు. చాట్రాయి మండలంతో పాటు నూజివీడు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి గౌడ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పర్వతాపురం గ్రామ గౌడ సంఘ సభ్యుడు భూబత్తుల చెన్నారావు విజ్ఞప్తి చేశారు.