డెంగ్యూ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి, జూలై 30: డెంగ్యూ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పిలుపునిచ్చారు.
డెంగ్యూ మాసోత్సవాల ముగింపు సందర్భంగా చింతలపూడి పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణ చర్యల్లో ప్రజలు చురుకుగా పాల్గొని తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వారిని భాగస్వాములను చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ ఆఫ్రిన్, మున్సిపల్ కమిషనర్ రాంబాబు, వైద్య సిబ్బంది, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.