BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

ఎల్‌ఈడీ హెడ్‌లైట్లతో రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు

తెలంగాణ
26 Jan, 2026 - 07:59 PM
299 వీక్షణలు
ఎల్‌ఈడీ హెడ్‌లైట్లతో రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు ఆర్టీవో శాఖ పర్యవేక్షణపై ప్రజల ప్రశ్నలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్టీవో శాఖ నిజంగా పనిచేస్తుందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత రోడ్లపై వాహనాలు నడపాలంటే భయం వేస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాల్లో అమర్చిన అధిక కాంతి గల ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల వల్ల కళ్లకు ఏమి కనిపించకుండా పోతోందని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. అనుమతికి మించి వెలుగుతో ఉన్న లైట్లు రోడ్డు భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. గతంలో వాహనాల హెడ్‌లైట్లపై సగం వరకు బ్లాక్ పెయింట్ లేదా బ్లాక్ స్టిక్కర్ వేయకపోతే అనుమతి ఇచ్చేవారు కాదని, ప్రస్తుతం ఆ నిబంధన అమలులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని వాహనదారులు గుర్తు చేస్తున్నారు. ఎల్‌ఈడీ లైట్ల నియంత్రణలో ఆర్టీవో శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాల కాంతి వల్ల చూపు కోల్పోయి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, హెడ్‌లైట్లపై నియంత్రణ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం హెడ్‌లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ వేయాలనే పాత నిబంధనను తిరిగి అమలు చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. #RoadSafety #LEDHeadlights #TrafficRules #RTO #VehicleSafety #NightDriving #RoadAccidents #PublicConcern #Punganur #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube