BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఎల్‌ఈడీ హెడ్‌లైట్లతో రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు

తెలంగాణ
26 Jan, 2026 - 07:59 PM
347 వీక్షణలు
ఎల్‌ఈడీ హెడ్‌లైట్లతో రోడ్లపై ప్రమాదకర పరిస్థితులు ఆర్టీవో శాఖ పర్యవేక్షణపై ప్రజల ప్రశ్నలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్టీవో శాఖ నిజంగా పనిచేస్తుందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత రోడ్లపై వాహనాలు నడపాలంటే భయం వేస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాల్లో అమర్చిన అధిక కాంతి గల ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల వల్ల కళ్లకు ఏమి కనిపించకుండా పోతోందని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. అనుమతికి మించి వెలుగుతో ఉన్న లైట్లు రోడ్డు భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. గతంలో వాహనాల హెడ్‌లైట్లపై సగం వరకు బ్లాక్ పెయింట్ లేదా బ్లాక్ స్టిక్కర్ వేయకపోతే అనుమతి ఇచ్చేవారు కాదని, ప్రస్తుతం ఆ నిబంధన అమలులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని వాహనదారులు గుర్తు చేస్తున్నారు. ఎల్‌ఈడీ లైట్ల నియంత్రణలో ఆర్టీవో శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాల కాంతి వల్ల చూపు కోల్పోయి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, హెడ్‌లైట్లపై నియంత్రణ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం హెడ్‌లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ వేయాలనే పాత నిబంధనను తిరిగి అమలు చేయాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. #RoadSafety #LEDHeadlights #TrafficRules #RTO #VehicleSafety #NightDriving #RoadAccidents #PublicConcern #Punganur #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube