BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 23 March 2026, 07:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డ్రగ్స్ గంజాయి మాఫియా గ్యాంగ్‌లను తరిమికొడదాం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:20 PM
146 వీక్షణలు

డ్రగ్స్ గంజాయి మాఫియా గ్యాంగ్‌లను తరిమికొడదాం – భగత్ సింగ్ ఆశయాల కోసం. కాగడాల ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో సిపిఎం, సిఐటియు మండల కమిటీల ఆధ్వర్యంలో అమరవీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా కాగడాలతో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన సుఖదేవ్ థాపర్, శివరామ్ రాజగురు వంటి యువ వీరులను స్మరించుకున్నారు. అప్పట్లో దేశం కోసం యువత ప్రాణాలు అర్పించగా, నేటి కాలంలో కొంతమంది యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ మాఫియా, గంజాయి వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు పదార్థాలపై ప్రజలు, కార్మికులు, యువత కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం, సిఐటియు మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, హర్ష, తాపీ వర్కర్స్ యూనియన్ సభ్యులు గజ్జినబోయిన రాము, లక్కనబోయిన శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, రంగా రాణి తదితరులు పాల్గొన్నారు.