BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

డ్రగ్స్ గంజాయి మాఫియా గ్యాంగ్‌లను తరిమికొడదాం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:20 PM
60 వీక్షణలు

డ్రగ్స్ గంజాయి మాఫియా గ్యాంగ్‌లను తరిమికొడదాం – భగత్ సింగ్ ఆశయాల కోసం. కాగడాల ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో సిపిఎం, సిఐటియు మండల కమిటీల ఆధ్వర్యంలో అమరవీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా కాగడాలతో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన సుఖదేవ్ థాపర్, శివరామ్ రాజగురు వంటి యువ వీరులను స్మరించుకున్నారు. అప్పట్లో దేశం కోసం యువత ప్రాణాలు అర్పించగా, నేటి కాలంలో కొంతమంది యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

డ్రగ్స్ మాఫియా, గంజాయి వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు పదార్థాలపై ప్రజలు, కార్మికులు, యువత కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మేకల జ్ఞానరత్నం, సిఐటియు మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, హర్ష, తాపీ వర్కర్స్ యూనియన్ సభ్యులు గజ్జినబోయిన రాము, లక్కనబోయిన శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, రంగా రాణి తదితరులు పాల్గొన్నారు.