www.ntodaynews.com
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి రూ.10,000 జరిమాన
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి రూ.10,000 జరిమాన
తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తాడిపత్రి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ప్రభావతి ఈ రోజు కేసు నంబర్ 222/2026 (మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185) మేరకు విచారణ చేపట్టారు.
ఈ కేసులో ముద్దాయి నరిగ నగేష్, గోరుమానిపల్లి గ్రామం, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్. విచారణ అనంతరం కోర్టు ముద్దాయికి రూ.10,000 జరిమానా విధించడంతో పాటు ఈ రోజు సాయంత్రం వరకు కోర్టు ప్రాంగణంలో ఉండే విధంగా శిక్ష విధించింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారికి ఇది గట్టి హెచ్చరికగా తీసుకోవాలని తాడిపత్రి రూరల్ ఇన్స్పెక్టర్ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.